హైదరాబాద్‌కి నలుగురు మేయర్లు భాగ్యనగరం ముక్కలు అవుతుందా?

Oct 9, 2024, 5:42 PM IST

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో ఇప్పటికే రాజకీయాలు హీటెక్కాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు మూసీ నది ప్రక్షాళన రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయా అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. నగర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఘోరంగా ఓడించినందుకే ఈ హైడ్రా, మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుకు దిగిందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి మరో రాజకీయ దుమారానికి తెరలేపారు.