Pahalgam Attack: క‌శ్మీర్‌లో దాడి చేసిన ఉగ్ర‌వాదులు ఎలా ఉంటారో తెలుసా.? స్కెచ్‌లు విడుద‌ల చేసిన అధికారులు

Published : Apr 23, 2025, 12:05 PM IST
Pahalgam Attack: క‌శ్మీర్‌లో దాడి చేసిన ఉగ్ర‌వాదులు ఎలా ఉంటారో తెలుసా.? స్కెచ్‌లు విడుద‌ల చేసిన అధికారులు

సారాంశం

కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి విషయంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను సంస్థలు విడుదల చేశాయి.. 

ప్రత్యక్ష సాక్షుల ఇచ్చిన సమాచారం ఆధారంగా, పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను సంస్థలు విడుదల చేశాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అశాంతిని రగిలించానే దుర్భుద్ధితో ఉగ్రవాదులు ఈ దాడులకు దిగారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన  ఈ ఘటనలో 26 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. 

ఘటన అనంతరం ఉగ్రవాదులు పక్కనే ఉన్న అడవి నుంచి పారిపోయారు. దీంతో వారిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు బృందాలుగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌ను మ‌ధ్య‌లోనే ర‌ద్దు చేసుకొని భార‌త్‌కు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌చ్చిరాగానే విమాన‌శ్ర‌యంలోనే అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. క‌శ్మీర్‌లో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురావ‌డంపై ప్ర‌ధాని చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే క‌శ్మీర్‌లో మ‌రిన్ని ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశముంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో అధికారులు ప‌టిష్ట భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. క‌శ్మీర్ వ్యాప్తంగా హైఅల‌ర్ట్ జారీ చేశారు. పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఉగ్ర‌వాదులు త‌ప్పించుకుని పోయిన అడ‌వి ప్రాంతంలో గ‌స్తీ కాస్తున్నారు. హెలికాప్ట‌ర్‌ల స‌హాయంతో ఉగ్ర‌వాదుల‌ను గుర్తించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood