దుబ్బాక బై పోల్ : హీటెక్కుతున్న ప్రచారం... చావో రేవో తేల్చుకోనున్న పార్టీలు...

Oct 23, 2020, 7:09 PM IST

మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ గా నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.   నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా గడిచిపోయింది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ప్రచార జోరును పెంచేశాయి. ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్నారు నాయకులు.