కొందరు చేసిన ఆ పని వల్లే టాలీవుడ్ లో అవకాశాలు ఆగిపోయాయి.. ఇన్నేళ్ల తర్వాత మ్యాటర్ బయటపెట్టిన ఇలియానా

First Published Apr 30, 2024, 6:28 PM IST

రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించిన తర్వాత ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళింది. అప్పటి నుంచే టాలీవుడ్ లో తనకి ఆఫర్స్ కరువయ్యాయని ఇలియానా ఓపెన్ గా చెప్పేసింది.

దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో సునామి సృష్టించింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో కలసి ఆడిపాడింది. పోకిరి చిత్రం తర్వాత ఇలియానాకి వచ్చిన అవకాశాలతో ఆమె ఉక్కిరి బిక్కిరి అయినట్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. 

ఆమెతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన కాజల్ లాంటి హీరోయిన్లు ఇంకా కొనసాగుతున్నారు. కానీ ఇలియానాకి మాత్రం టాలీవుడ్ లో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇటీవల ఇలియానా దో ఔర్ దో ప్యార్ చిత్రంలో నటించింది. బాలీవుడ్ లో నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఇలియానా పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించిన తర్వాత ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళింది. అప్పటి నుంచే టాలీవుడ్ లో తనకి ఆఫర్స్ కరువయ్యాయని ఇలియానా ఓపెన్ గా చెప్పేసింది. ఆ తర్వాత కేవలం అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో మాత్రమే ఇలియానా నటించింది. 

టాలీవుడ్ లో బిజీగా ఉన్న టైంలో నాకు అనురాగ్ బసు దర్శకత్వంలో బర్ఫీ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. టాలీవుడ్ లో చాలా చిత్రాలు ఉన్నప్పటికీ బర్ఫీ చిత్రాన్ని వదులుకోవాలనిపించేలేదు. నేను అనుకున్నట్లుగానే బర్ఫీ మంచి విజయం సాధించింది. 

దీనితో టాలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలు ఇక ఇలియానా ఇక్కడ నటించదు అని ప్రచారం చేశారు. దీనితో అవకాశం ఇస్తామనుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేదు. నేను బాలీవుడ్ లో సెటిల్ అయిపోయినట్లు అంతా భావించారు అని ఇలియానా పేర్కొంది. నేను టాలీవుడ్ లో నటించినా బాలీవుడ్ లో నటించినా ఎంతో నిజాయతీగా నా వర్క్ చేశాను. 

నేను పడ్డ కష్టానికి నాకు దక్కిన గుర్తింపు తక్కువే అని ఇలియానా వాపోయింది. ఇలియానా తెలుగులో పోకిరి, జులాయి, జల్సా, దేవదాసు, కిక్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించింది. 

click me!