Mar 12, 2023, 3:33 PM IST
కరీంనగర్ :తమకు దళిత బంధు అందలేదంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన కొందరు దళితులు వినూత్న నిరసన చేపట్టారు. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ప్రకటించిన దళితబంధు నియోజకవర్గంలో వందశాతం అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు బాధిత దళితులు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వినతి పత్రాన్ని అతికించారు. ఉపఎన్నిక సమయంలో చెప్పినట్లు నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని... లేదంటే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.