Feb 11, 2020, 1:44 PM IST
గాంధీ ఆసుపత్రిలో రెండు కరోనా వైరస్ పాజిటిల్ కేసులు నమోదయ్యాయని తప్పుడు సమాచారం మీడియాకు ఇచ్చారనే ఆరోపణలతో డాక్టర్ వసంత్పై సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంది. డాక్టర్ వసంత్ను డైరెక్టర్ ఆప్ హెల్త్కు సరెండర్ చేసింది. మంగళవారం డాక్టర్ వసంత్ గాంధీ ఆసుపత్రి ఎదుట పెట్రోల్ బాటిల్ తో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు.