మెడలో పూలదండ, చేతిలో త్రిశూలంతో ఈటల... శామీర్ పేట నివాసంలో సందడి

Jul 5, 2023, 2:29 PM IST

హైదరాబాద్ :తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ ఇంటివద్ద సందడి నెలకొంది. శామీర్ పేటలోని ఈటల నివాసానికి భారీగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చేరుకుని  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బిజెపి నేతలు ఈటలకు శాలువా కప్పి, మెడలో పూలదండ వేసి, చేతికి తిశూలం అందించి సత్కరించారు. ఇలా త్రిశూలం చేతబట్టిన ఈటల సరికొత్తగా కనిపించారు.