పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు తలను కొరికిన ఎలుగుబంట్లు

Jan 11, 2020, 8:04 AM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామంలో రాజిరెడ్డి అనే రైతు పొలానికి వెడుతుండగా, మూడు ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న గ్రామస్తులు గమనించి ఎలుగుబంట్లను తరిమేశారు. అప్పటికే ఆ రైతు తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికులు అతన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.