పోలవరం వివాదం: తెలంగాణ సెంటిమెంట్ కు కెసిఆర్ పదును

Jul 29, 2022, 11:00 AM IST

పోలవరం ముంపు గ్రామాల వివాదాన్ని ఆసరా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటకు పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బిజెపి దూకుడు పెంచిన ప్రస్తుత నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాల అంశాన్ని ఆయన ఎజెండాగా మార్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం సమీపంలోని ఏడు మండలాలను మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన నేపథ్యంలో దాన్ని అస్త్రంగా మార్చుకోవాలని ఆయన చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ లేవనెత్తే ప్రధానాంశాల్లో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి కానుంది.