మహారాష్ట్రలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు : డిప్యూటీ సీఎం అజిత్ పవార్

Jan 28, 2020, 1:17 PM IST

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సిఎఎ, ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సి మీద మాట్లాడారు. సిఎఎ, ఎన్ఆర్సీ కారణంగా రాష్ట్రంలో ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారని అన్నారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాయి. కానీ మహారాష్ట్ర లో అలా కాదు అని అన్నారు.