Feb 26, 2020, 4:40 PM IST
గతంలో గుజరాత్ లో 2002 అల్లర్లు జరిగినప్పుడు ఏర్పడ్డప్పటి పరిస్థితులే ఇప్పుడు ఢిల్లీలో కనబడుతున్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నాడు. గతంలో గుజరాత్ లో పోలీసులు ఎలా అయితే అంత త్వరగా రంగంలోకి దిగలేదో... ఇప్పుడు ఢిల్లీలో కూడా పోలీసులు సమయానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. పోలీసులకు ఆర్డర్స్ ఇవ్వకపోతే వారు మాత్రం ఏం చేయగలుగుతారని నవాబ్ మాలిక్ అమిత్ షా వైఖరిని తప్పుబట్టారు.