Anasuya Bharadwaj
నటి అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్. ఆమె ప్రతి చిన్న విషయం అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త చిత్ర విశేషాలు, విందులు, విహారాలు... అన్నీ షేర్ చేస్తారు. అభిమానులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పై స్పందిస్తూ ఉంటారు.
మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. సదరు ట్రోల్స్ పట్టించుకోదు అనసూయ. ఒక లైన్ దాటి నెగిటివ్ కామెంట్స్ చేస్తే కౌంటర్స్ ఇచ్చేస్తుంది. తన హేటర్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టడం అనసూయకు సరదా అని చెప్పొచ్చు.
Anasuya Bharadwaj
తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తనకు ఇష్టమైన మామిడి పళ్ళను తింటుంది. ఆమె తింటున్న విధానం కొంచం మాస్ గా ఉంది. ఇటీవల అనసూయ తన ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్లకు కాసిన కాయలను కోయించింది. అవికాస్తా పండటంతో ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తోంది.
Anasuya Bharadwaj
మామిడి పండుకు మెత్తగా నొక్కిన అనసూయ తోలుకు రంద్రం పెట్టి జ్యూస్ జుర్రేసింది. ఇలా మామిడి పళ్ళను చాలా మంది తింటారు. అయితే పబ్లిక్ లో తినరు. అలా తినడం మేనర్స్ కాదని అనుకుంటారు. కానీ అనసూయ నచ్చినట్లు ఉంటారు. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించరు. రసాల మామిడి పండును తనకు ఇష్టమైన పద్ధతిలో లాగించింది.
Anasuya Bharadwaj
ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ మంచి కసి మీద ఉన్నారు. మామిడి కాయలు లాగించేస్తున్నారని అంటున్నారు. మరి సమ్మర్ లో మాత్రమే దొరికే మామిడి పళ్ళను ఇష్టపడని వారు ఉండరు. ఇండియా మామిడి కాయలకు ప్రసిద్ధి కాగా, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని మామిడి కాయను అంటారు.
Anasuya Bharadwaj Hot Photos
ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే... నెక్స్ట్ ఆమె పుష్ప 2లో లేడీ విలన్ దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.