భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది (వీడియో)

Oct 12, 2019, 5:38 PM IST

భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మామల్లపురం పర్యటన నాంది పలుకుతుందని ప్రధాని మోడీ అన్నారు.  చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన తొలి భేటీ తరువాత చైనా అధ్యక్షుడు భారత్ లోని మహాబలిపురం లో పర్యటిస్తున్నారు. ఈ అనధికారిక పర్యటనను చెన్నై కనెక్ట్ పేరుతో వ్యవహరిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడు కోవలంలోని తాజ్ ఫిషర్ మాన్స్ కేవ్ హోటల్ లో సరదాగా గడిపారు.