వీఆర్వోల ఆగడాలు.. పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య.. (వీడియో)

Jun 20, 2020, 2:58 PM IST

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి అనే రైతు కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా తనకు ఉన్న ఒక ఎకరం 20 గుంటల భూమి తన పేరుమీద చేయమని తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి తాసిల్దార్ ను, వీఆర్వోలను బ్రతిమిలాడి చివరకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తన భూమి తన పేరిట చేయడం లేదంటూ కాల్వశ్రీరాంపూర్ వీఆర్వో లు గురు ముర్తి , స్వామిల  పేరు మీద సూసైడ్ నోట్  రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.