గ్రూప్-2 అభ్యర్థుల గోస (వీడియో)

Mar 22, 2019, 1:40 PM IST

హైదరాబాద్: సామూహికంగా కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ గ్రూప్ -2 సెలెక్టెడ్ అభ్యర్థులు శుక్రవారం నాడు హెచ్ఆర్‌సీకి వినతిపత్రం సమర్పించారు.

2015లో జూన్‌లో నోటిఫికేషన్ విడుదలైనా కూడ ఇంతవరకు సెలెక్టైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడంలో టీఎస్‌పీఎస్‌సీ జాప్యం చేయడాన్ని నిరసిస్తూ సుమారు మూడు వేల మంది అభ్యర్థులు శుక్రవారం నాడు హెచ్‌ఆర్‌సీకి వినతిపత్రం సమర్పించారు. టీఎస్‌పీఎస్‌సీ సరిగా వ్యవహరించని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.