కరోనా వేళ... హిందూ శాంతిమంత్రంతో మార్మోగిన వైట్ హౌజ్!

May 9, 2020, 2:09 PM IST

అమెరికా జాతీయ ప్రార్థనా దినోత్సవం నాడు వైట్ హౌజ్ అంతా హిందూ మంత్రాలతో మార్మోగిపోయింది. హిందూ ఆచారి పండిట్ హరీష్ బ్రహ్మబట్ట యజుర్వేదంలో శాంతి మంత్రాన్ని అక్కడ పఠించారు. ఈ కరోనా కష్టకాలంలో లాక్ డౌన్, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కఠినమైన చర్యల వల్ల ప్రజలు ఆవేదనకు గురయ్యే ఆస్కారముందని, అందుకోసం యజుర్వేదం లోని ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తున్నట్టు, ప్రజలందరూ హాయిగా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఎంతో ఉపయుక్తకరమని ఈ సందర్భంగా ఆ పండితుడు చెప్పాడు.