video:దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మరువక ముందే... గుంటూరు దారుణం

Dec 6, 2019, 8:43 PM IST

దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు అత్యంత దారుణంగా పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలకు భయపడి అయినా మహిళలపై వేధింపులు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మహిళా రక్షణపై ప్రశ్నలు రేకెత్తించే సంఘటన ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఏపి రాజధాని ప్రాంతంలోని ఎర్రబాలెంలో గ్రామంలో ఓ మహిళ పట్ల నలుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన గ్రామస్తులు ఇద్దరు యువకులను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు యువకులు గ్రామస్తుల నుండి తప్పించుకున్నారు. వారి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.