Video:దుర్గమ్మా... సీఎం జగన్ మనసు మార్చమ్మా... విజయవాడకు మహిళల పాదయాత్ర

Jan 19, 2020, 1:48 PM IST

అమరావతి: అమరావతి పరిధిలోని 29 గ్రామాల నుంచి సుమారు ఐదు వందల మంది మహిళలు మందడం శివాలయం నుండి విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి పాదయాత్ర ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని.... అమరావతి మాత్రమే రాజధానిగా చాలు అని కోరుకుంటూ ముడుపు చెల్లించుకొడానికి వెళుతున్నట్లు మహిళలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని కనకదుర్గమ్మ కోరనున్నట్లు మహిళలు తెలిపారు.