'కాలేజ్ కుమార్' ట్రైలర్.. కొత్తగా ఉందే!

Feb 25, 2020, 9:43 AM IST

నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్‌ కుమార్‌’. రాహుల్‌ విజయ్‌, ప్రియ వడ్డమాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా హరి సంతోష్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్‌ నటుడు సాయికుమార్‌ ఆవిష్కరించారు. మార్చి 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.