మహబూబ్, సోహైల్ బూతుల పురాణం.. బిబి హౌజ్ లో రచ్చ రచ్చ...

Sep 24, 2020, 11:33 AM IST

బిగ్ బాస్ హౌజ్ లో బుధవారం రసవత్తంగా సాగింది. మంగళవారం మొదలైన రోబో, మనుషులు టాస్క్ ఇంకా కొనసాగుతోంది. దీంట్లో ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఒకరిమీద ఒకరు విజయం సాధించాలని చూస్తున్నారు. మంగళవారం మనుషుల టీం దేవీ రోబోను చంపేశారు. దీంతో బుధవారం నాటి ఎపిసోడ్లో రోబోల టీం తాము మనుషుల కంటే వీక్ కాబట్టి తెలివితో గెలవాలని ప్లాన్ వేశారు. మనుషుల టీంలో ఒకర్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు.