విషాదం... ఇద్దరు ఆడపిల్లలకు పురుగుల మందిచ్చి చంపి...

Apr 28, 2021, 4:47 PM IST


కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాల్దార్ పేటలో నివాసముండే ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కూతుళ్లతో కలిపి తల్లిదండ్రులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతి చెందినవారిని శేఖర్ (35), కళావతి (30), అంజలి (16), అఖిల(14)లుగా పోలీసులు గుర్తించారు.