కూతుళ్లతో తిరుమల వెళ్లిన పవన్ డిక్లరేషన్ పై ఎందుకు సంతకం చేయాల్సి వచ్చింది?

Oct 2, 2024, 4:29 PM IST

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలను కేంద్ర బిందువుగా మారింది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో జంతువుల మాంసంతో కల్తీ చేసిన నెయ్యిని వాడారంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలయ్యింది. ఇది ఇక్కడితో ఆగకుండా అన్య  మతస్తులు తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని... మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందంటూ ఆయనను ఇరకాటంలో పెట్టే స్ధాయికి చేరింది. ఇలా ఈ డిక్లరేషన్ వ్యవహారం ఇప్పుడు తిరుమలలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.