నేను సైతం-రైతు కోసం... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టిడిపి భారీ ర్యాలీలు

Sep 30, 2021, 2:42 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ''నేను సైతం‌-రైతు కోసం'' పేరిట కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు సమస్యలపై భారీ ర్యాలీలు చేపట్టారు. రెండు జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో టిడిపి శ్రేణులు కదం తొక్కి ర్యాలీలో పాల్గొన్నాయి. నరసరావుపేట పార్లమెంట్ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పత్తిపాటి పుల్లారావు, బాపట్ల పార్లమెంట్ వేమూరు నియోజకవర్గ పరిధిలో  నక్కా ఆనందబాబు, నర్సాపేట పార్లమెంట్ వినుకొండ నియోజకవర్గ పరిధిలో జివి ఆంజనేయులు, అచ్చంపేటలో కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి.