తిరుపతి లడ్డూ మీరు తయారు చేసి అమ్మితే కేసు పెడతారు తెలుసా?

First Published Sep 27, 2024, 12:11 AM IST

సాధారణంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం తిని ఎంత టేస్టీగా ఉందో అని అనుకుంటాం కదా.. కొంత మంది ఆ రెసిపీ తెలుసుకొని ఇంటి దగ్గర కూడా తయారు చేయడానికి ట్రై చేస్తారు. అయితే రెసిపీకి పేటెంట్ హక్కులుంటే, మీకు తెలియక దాన్ని మీరు కమర్షియల్ పర్పస్ లో తయారు చేసి అమ్మితే మీపై కేసులు పెడతారు. చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు. ఇండియాలో పేటెంట్ హక్కులు ఉన్న ప్రముఖ దేవాలయాలు, వాటి ప్రసాదాల గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

ఇండియాలో ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అది చరిత్ర వల్ల కావచ్చు. స్థల పురాణం, వాతావరణ పరిస్థితులు, దేవతా విగ్రహాలు ఇలా అనేక విషయాల వల్ల ఆ క్షేత్రాలు ఫేమస్ అవుతాయి. వీటిలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రసాదాలు. అవును.. ఆ పుణ్యక్షేత్రంలో పంచే ప్రసాదాల వల్ల కూడా అవి ప్రసిద్ధి చెందుతాయి. ఆ ఆలయాలకు అంత పేరు తెచ్చిన ప్రసాదాలకు పేటెంట్ హక్కులుంటాయని మీకు తెలుసా? అలాంటి ప్రసాదాలను ఎక్కడా కమర్షియల్ గా తయారు చేయకూడదు. అమ్మకూడదు. ఒక వేళ అలా చేస్తే ఆ ప్రసాదం పేటెంట్ హక్కులు పొందిన ఆలయ కమిటీ మీపై కేసు వేస్తుంది. చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటుంది. 

భారతదేశంలో పేటెంట్ లేదా భౌగోళిక సూచిక (Geographical Indication) హక్కులు పొందిన పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా మూడున్నాయి. మరికొన్ని పేటెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇవి 
వాటి ప్రసాదాలు వల్లనే ఈ ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఈ ప్రసాదాలు ఆ పుణ్యక్షేత్రానికి మాత్రమే చెందుతాయి. అలాగే వీటిని తయారు చేసే పద్ధతులు కూడా విభిన్నంగా ఉంటాయి. వాటిని ఇతరులు ఎవరూ బిజినెస్ పర్పస్ లో తయారు చేయకూడదు. అవేంటంటే..
 

Latest Videos


తిరుమల తిరుపతి దేవస్థానం (ఆంధ్ర ప్రదేశ్) - తిరుపతి లడ్డూ

తిరుపతి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఎందుకంటే లడ్డూ టేస్ట్ అలా ఉంటుంది మరి. చాలా పుణ్యక్షేత్రాల్లో కూడా లడ్డూను ప్రసాదంగా పంచుతారు. విజయవాడ, శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం ఇలా ఏ క్షేత్రానికి వెళ్లినా అక్కడి ప్రసాదాలతో పాటు కచ్చితంగా లడ్డూ ప్రసాదంగా ఇస్తారు. అయితే మీరు గమనించి ఉంటే తిరుపతి లడ్డూ టేస్ట్ మరే ఇతర లడ్డూల్లోనూ కనిపించదు. ఎందుకంటే తిరుపతి లడ్డూకి పేటెంట్ ఉంది. ఇది తిరుమల ఆలయంలో మాత్రమే తయారు చేస్తారు. అలాంటి టేస్ట్ తో వేరే ఎక్కడా లడ్డూలు తయారు చేసి విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం 2009లో GI హక్కులు పొందింది. అందుకే ఏ ఇతర పుణ్యక్షేత్రాల్లో లడ్డూల టేస్ట్ తిరుపతి లడ్డూలా ఉండదు. 

శబరిమల ఆలయం(కేరళ) - అరవన పాయసం, అప్పం
శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా చాలా ఫేమస్. ఇక్కడ ప్రసాదం టేస్ట్ కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా మీకు ఇంకెక్కడా లభించదు. ఈ క్షేత్రంలో రెండు రకాల ప్రసాదాలు చాలా ప్రత్యేకం. అవి అరవన పాయసం, అప్పం. వీటిని చాలా ప్రత్యేకమైన పద్ధతుల్లో తయారు చేస్తారు. వీటిలో ఉపయోగించే ఇంగ్రిడియన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. 

అరవన పాయసం తయారీలో గోధుమలు, నెయ్యి, చక్కెర, మొదలైనవి ఉపయోగిస్తారు. అదే విధంగా అప్పం తయారీలో అరిగి పువ్వు, గోధుమ పిండి, నెయ్యి వాడతారు. ఈ ప్రసాదాలకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ 2011లో GI హక్కులు పొందింది. 

పళని మురుగన్ ఆలయం(తమిళనాడు) - పళని పంచామృతం
పళని పుణ్యక్షేత్రంలో పార్వతీపరమేశ్వరుల తనయుడైన కుమార స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. కోయంబత్తూర్, మధురై, కొడైకెనాల్ కు సుమారు సమాన దూరంలో ఉంది. ఆలయ పురాణం ప్రకారం కుమార స్వామి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులపై అలిగి పళని కొండపై వెలిశాడని భక్తులు నమ్ముతారు. తనను తాను తెలుసుకోవడం కోసం సన్యసించాడని, అందుకే శరీరంపై దుస్తులు కూడా లేకుండా విగ్రహ రూపంలో కొలువైయ్యాడని భక్తుల విశ్వాసం. 

పళనిలో స్వామికి అభిషేకించి ఇచ్చే పంచామృతం చాలా ఫేమస్. దీని తయారీలో అరటిపండ్లు, జవ్వాడ గోధుమలు, నెయ్యి, తేనె, చక్కెర తదితర పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ ప్రసాదానికి 2019లో GI హక్కులు వచ్చాయి. అందువల్ల ఈ పళని ప్రసాదాన్ని ఎక్కడా వ్యాపారం చేయడానికి తయారు చేయకూడదు. 

ఇదే విధంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశి(కాశీ)లో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదానికి పేటెంట్ హక్కులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక్కడ ప్రసాదంగా ఖజా అనే స్వీట్ ఇస్తారు. దీంతో పాటు లడ్డూ కూడా ఇక్కడ చాలా ఫేమస్. 

ఒడిశా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి ఆలయంలో మహా ప్రసాదం పేరుతో కొన్ని రకాల ప్రసాదాలు భక్తులకు పంచుతారు. వాటిలో చపాతీలు, ఖీర్, దలియా, పోలాలు, పకోరా, ఇతర పిండివంటలు ఉంటాయి.  వాటిని స్వామి వారికి నైవేద్యంగా పెట్టి పూజ తరువాత భక్తులకు పంచుతారు. ఈ ప్రసాదానికి GI హక్కులు పొందేందుకు ఆలయ కమిటీ ప్రయత్నిస్తోంది. 
 

click me!