జగన్ ఇంటి పక్కనే వలసకార్మికులపై లాఠీఛార్జి దారుణం.. చినరాజప్ప..

May 16, 2020, 5:32 PM IST

తాడేపల్లిలో వలసకార్మికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని టీడీపీ మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రిలో ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి దగ్గర్లోనే ఈ సంఘటన జరగడం అమానుషం అని మండిపడ్డారు. వందల కిలోమీటర్లు నడిచివెళ్ళే వలస కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని, వెంటనే వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపే చర్యలపై దృష్టి పెట్టాలని, వారికి భోజన,వసతి ఏర్పాట్లు ఎక్కడికక్కడే చేయాలని ఆయన డిమాండ్ చేశారు.