ప్రస్తుత పంచాయతీ సెక్రటరీ వల్లే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా..

Jan 25, 2023, 3:57 PM IST

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు సచివాలయంలో గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీ పప్పుల విజయ్ కుమార్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ బుధవారం నాడు ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలు విజయకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం అదే సచివాలయంలో పనిచేస్తున్న రామ కోటేశ్వరరావు అని పంచాయతీ సెక్రటరీ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారుల వద్ద తోటి ఉద్యోగుల వద్ద రాజకీయ నాయకుల వద్ద తనపై చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నాడని తెలిపారు దీనిపై మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.