వాలంటీర్ల ఆగడాలు.. బియ్యం తెచ్చుకున్నాడని.. కళ్లలో కారంపోసి కుళ్ల బొడిచారు...

May 25, 2020, 5:10 PM IST

గుంటూరు జిల్లా, నరసరావుపేటలో  శ్రీనివాస గిరిజనకాలనీలోని ఉయ్యాల శివకృష్ణ, ఉయ్యాల అంజమ్మ అనే తల్లి, కొడుకులపై వాలంటీర్లు దాడి చేసి చితకగొట్టారు. వాలంటీర్ మల్లికార్జున మాట వినలేదని తమపై దాడి  చేసారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఎవరూ రాకుండా ఉయ్యాల శివకృష్ణ దారికి కంపలు అడ్డుగా వేశారని ఆ విషయంలో మల్లికార్జున, ఉయ్యాల మద్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  ఆ గొడవలో కేసు నమోదు చేశామని, మరలా తమపై దాడి చేశారని శివకృష్ణ పిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సిఐ అచ్చయ్య చెబుతున్నారు.