Dec 4, 2019, 10:48 AM IST
గుంటూరుజిల్లా, వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి గ్రామంలో తెదేపా, వైసీపీ వర్గీయుల మధ్య మట్టి వద్ద వచ్చిన గొడవ పార్టీ ల మధ్య వైరంగా మారింది. అది కాస్త గొడవకు దారితీసింది. ఈ గొడవలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108 లో ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ విషయాన్ని వీడియో తీస్తున్న రిపోర్టర్ ను వీడియో తీయద్దంటూ గ్రామస్తులు ఫోన్ పగలకొట్టారు.