టీడీపీ ఆఫీసులోనే లైంగిక దాడి : కాటసాని, చల్లా

Jan 31, 2020, 11:46 AM IST

కర్నూలు జిల్లా, అవుకు లో బాలుడిపై లైంగిక దాడి ఘటన పై ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి లు తీవ్రంగా స్పందించారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ వారిని ఎన్ కౌంటర్ చేయాలని, టిడిపి కార్యకర్తలే లైంగిక దాడి లో ప్రధాన ముద్దాయిలు వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. లైంగిక దాడికి పాల్పడింది మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులేనని మండిపడ్డారు. అవుకు పట్టణంలోని టిడిపి కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.