వైసిపి దాడిలో టిడిపి నాయకుడు మృతి... కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

Mar 31, 2021, 5:03 PM IST

అమరావతి: పంచాయితీ ఎన్నికల సమయంలో ప్రత్యర్ధుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన టిడిపి నాయకుడి  కుటుంబాన్ని ఇవాళ(బుధవారం) టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్  పరామర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని లక్కరాజుగార్లపాడు లో మృతుడు గరికపాటి కృష్ణారావు ఇంటికి వెళ్లిన లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంటేపూడి నుంచి భారీ ర్యాలీగా లక్కరాజుగార్లపాడుకు లోకేష్ చేరుకున్నారు. లోకేష్ వెంట టిడిపి నేతలు కోడెల శివరాం, యరపతినేని, చదలవాడ అరవింద్, వై.వి.ఆంజనేయులు వున్నారు.