వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. నందికొట్కురులో పరిస్థితి ఉద్రిక్తం..

Jun 27, 2020, 4:00 PM IST

కర్నూలు జిల్లా మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నందికొట్కూరు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ఆర్థర్‌ను గ్రామంలోకి రాకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రోడ్డుపైనే బైఠాయించి ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల ప్రజలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.