Oct 20, 2022, 5:13 PM IST
అమరావతి : ఆనాడు వైఎస్సార్ ఆరోగ్య రంగానికి పునాది వేస్తే... ఆయన తనయుడు వైఎస్ జగన్ వైద్యరంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాడని ఏపీ వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని మంత్రి మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం కొత్తగా మరో 20 చొప్పున 108, 104 వాహనాలను ఏపీఐఐసి బిల్డింగ్ వద్ద మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ... విశాఖపట్నం సంఘటనను అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ , చంద్రబాబుల బయటపడ్డారని... వారి ముసుగు తొలగిపోయిందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భాష చాలా దారుణంగా వుందన్నారు. విశాఖపట్నంలో చేపట్టిన గర్జన విజయవంతం కావడంతో దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే పవన్ అలజడి సృష్టించారని మంత్రి రజని పేర్కొన్నారు.