వేసవిలో విద్యుత్ కోతలొద్దు... ముందుగానే జాగ్రత్తపడండి : అధికారులకు పెద్దిరెడ్డి ఆదేశం

Feb 13, 2023, 5:17 PM IST

అమరావతి : రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...  కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ లో కొత్త యూనిట్లను వినియోగంలోకి తేవాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. బొగ్గు కొరత లేకుండా ముందుస్తుగానే నిల్వలను సరిచూసుకోవాలని సూచించారు. సచివాలయంలో ఇవాళ ఇంధనశాఖపై మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రి రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో వుంచుకుని ముందు జాగ్రత్తలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.