పవన్ కు ఆల్రెడీ మూడు రాజధానులు వున్నాయిగా..: మంత్రి అమర్నాథ్ ఎద్దేవా

Oct 10, 2022, 5:06 PM IST

 అమరావతి : వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తలపెట్టిన విశాఖ గర్జనపై కామెంట్స్ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. డబ్బా పెరుగన్నం తిని డబ్బాల్లో డబ్బులు సర్దుకుని పవన్ ఏం చేశాడో అందరూ చూసారంటూ ఎద్దేవా చేసారు. ఐవైఆర్ బుక్ రిలీజ్ కార్యక్రమంలో పవన్ ఏం మాట్లాడాడో అందరూ విన్నారన్నారు. అయినా పవన్‌కు త్రీ క్యాపిటల్స్ ఉన్నాయి... అందుకే ఆయనకు జగన్ సర్కార్ ఏర్పాటుచేస్తామంటున్న రాజధానులు అవసరం లేదేమో అంటూ మంత్రి సెటైర్లు వేసారు. విశాఖ గర్జన పెద్ద ఎత్తున జరగబోతుంది.. దానితో అయినా పవన్ కల్యాణ్ కళ్ళు తెరవాలని అమర్నాథ్ ఎద్దేవా చేసారు.