బావను కత్తితో పొడిచి చంపిన బావమరిది.. అక్కమీది ప్రేమతోనే..

May 25, 2020, 2:12 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. బామ్మర్ది బతక కోరతాడంటారు.. కానీ ఆ బామ్మర్తి బావ ప్రాణాల్నే తీశాడు. వివరాల్లోకి వెడితే అంకమ్మరావు, తిరుపతమ్మలు భార్యాభర్తలు వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో తిరుపతమ్మ పురుగులమందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అక్కను హాస్పిటల్ లో అలా చూసిన తమ్ముడు వెంకటేష్ ఆవేశంతో బావను కత్తితో పొడివడంతో అంకమ్మరావు అక్కడికక్కడే మరణించాడు. తిరుపతమ్మ ఇంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.