మిగిలిపోయిన మజ్జిగతో ఏమేమి చేయొచ్చు?

First Published May 2, 2024, 4:55 PM IST

ఎండాకాలంలో మజ్జిగను రోజూ  తాగుతుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మజ్జిగ మిగిలిపోతుంటుంది. అయితే చాలా మంది ఇలా మిగిలిపోయిన మజ్జిగను తాగడానికి ఇష్టపడరు. ఇంకేముంది దీన్ని పారేస్తుంటారు. కానీ మిగిలిపోయిన మజ్జిగతో మీరు ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. దీనితో మీరు టేస్టీ టేస్టీ వంటలు తయారుచేయొచ్చు. 
 

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆకలి తగ్గి దాహం బాగా పెరుగుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి కారణంగా గొంతు మరింత పొడిబారుతుంది. అలాగే చెమట వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ బాగా తగ్గుతుంది. దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్లతో పాటుగా మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లను తాగుతుంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. 
 

అయితే ప్రతి డ్రింక్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ఎండాకాలంలో చాలా మంది మజ్జిగను తాగడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి దీనిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అలాగే దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు.  అందుకే చాలా మంది అవసరమైన దానికంటే మజ్జిగను కాస్త ఎక్కువగానే తయారుచేస్తారు. కానీ కొన్ని కొన్ని సార్లు మజ్జిగను ఎవరూ తాగకపోవడంతో అది అలాగే మిగిలిపోతుంది. అయితే మిగిలిపోయిన మజ్జిగ మరుసటి రోజుకల్లా మరింత పుల్లగా మారుతుంది. అందుకే దీన్ని ఎవరూ తాగాలనుకోరు. ఇంకేముంది డస్ట్ బిన్ లో పారేస్తారు. కానీ మిగిలిపోయిన మజ్జిగను ఉపయోగించి మీరు ఎన్నో టేస్టీ టేస్టీ వంటకాలను తయారుచేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


గ్రేవీ తయారు చేయడానికి.. 

ఈసారి గ్రేవీని తయారు చేయడానికి పెరుగుకు బదులుగా మజ్జిగను వాడండి. అవును మజ్జిగ గ్రేవీ రుచిని బాగా పెంచుతుంది. మజ్జిగను వాడితే గ్రేవీ రంగు కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ రుచి, రంగు ఎంత రుచిగా ఉంటుందో మీరు ఊహించలేరు.  మజ్జిగను ఉపయోగించడం వల్ల గ్రేవీ చాలా మందంగా మారుతుంది. అందుకే చాలా మంది పెరుగుకు బదులుగా మజ్జిగనే గ్రీవికి ఉపయోగిస్తారు. అలాగే మాంసాహారం చేయడానికి కూడా మజ్జిగను ఉపయోగించొచ్చు. అయితే మాంసాహారంలో మజ్జిగను ఉపయోగించే ముందు రుచి చూసి ఆ తర్వాత ఆహారంలో కలుపుకోవాలి.
 

మజ్జిగతో దోశ పిండి.. 

దోశపిండిని తయారు చేయడానికి మీరు బటర్ మిల్క్ ను కూడా ఉపయోగించొచ్చు. దీని కోసం మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ముందుగా దోశపిండిని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకోండి. అయితే ఇది మిక్సీ పడుతున్నప్పుడు వాటర్ కు బదులుగా మజ్జిగను వేసి కలపండి.

dosha

ఇలా చేయడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి దోశ రుచిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. మజ్జిగను కలపడం వల్ల దోశ మెత్తగా, రుచిగా ఉంటుంది. అయితే మీరు దీని పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 

click me!