గుంటూరులో మహిళా జేఏసీ సభ్యుల బస్సును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

Feb 24, 2020, 5:31 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ మండలం లేమల్లే గ్రామంలో  మహిళా జేఏసీ సభ్యుల బస్సుని  వైసీపీ వర్గీయులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిత్త వాతావరణం ఏర్పడింది. వారు క్రిందకి దిగకుండా వైసీపీ శ్రేణులు వాటర్ డ్రమ్స్ అడ్డుపెట్టడంతో పాటు బస్సులో ఉన్నవారిపై కారం చల్లి, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్స్ లాకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి వారంతా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులని బస్సులో వున్న ఒక మహిళ వాట్సాప్ వాయిస్ లో తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి బస్సుని పంపించటంతో వాతావరణం చల్లబడింది.