విశాఖలో జనసేన కార్పోరేటర్ మూర్తియాదవ్ ఆమరణ నిరాహార దీక్ష...

Jan 23, 2023, 1:45 PM IST

విశాఖపట్నం : జనసేన పార్టీని గెలిపించుకున్నారనే తన వార్డును అభివృద్దిని పట్టించుకోవడం లేదంటూ విశాఖపట్నం కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. విశాఖలోని 22వ డివిజన్ లో వెంటనే అభివృద్ది పనులు మొదలుపెట్టాలంటూ జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద మూర్తియాదవ్ ఆమరణ దీక్షకు దిగాడు. తనపై, జనసేన పార్టీపై కక్షతో రెండేళ్లుగా తన వార్డులో ఒక్క రోడ్డు  లో వెయ్యలేదు...ఒక్క గుంత పూడ్చలేదంటూ మండిపడ్డారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకోసం ఎంతదూరమైనా వెళతానని... అవసరమైతే వార్డు అభివ‌ృద్దికోసం ఆత్మబలిదానానికైనా సిద్దమేనని కార్పోరేటర్ మూర్తినాయుడు తెలిపాడు.