Nov 17, 2020, 1:29 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం చేరుకున్నారు. అక్కడ పనులను పర్యవేక్షించారు. అధికారులతో కలిసి స్పిల్ వే పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదేనని ఇటీవల అనిల్ కుమార్ అన్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం అని తెలిపిన విషయం తెలిసిందే.