Video : సైబర్ నేరగాళ్ల వలలో కనకదుర్గమ్మ భక్తులు

Dec 10, 2019, 5:18 PM IST

విజయవాడలోని ప్రముఖ కనకదుర్గ దేవాలయం పేరుతో నకిలీ వెబ్ సైట్ ను సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఘటన తాజాగా బయటపడింది. ముఖ్యంగా దుర్గగుడి ఆర్జిత సేవల కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించిన భక్తులు భారీమొత్తంలో డబ్బులు చెల్లించి చివరకు మోసపోయామని గ్రహించి ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. నకిలీ వెబ్ సైట్స్ పై దుర్గగుడి ఆలయ అధికారులు తమకు ఫిర్యాదు చేసినట్లు సిపి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వీటిద్వారా అమ్మవారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు మోసపోతున్నట్లు...వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈవో లిఖిత పూర్వక ఫిర్యాదు అందించినట్లు సిపి తెలిపారు.