Feb 12, 2020, 1:23 PM IST
కృష్ణాజిల్లా నందిగామ లో మార్కెట్ యార్డు వద్ద రైతులు గేట్ కి అడ్డంగా ట్రాక్టర్ పెట్టి ఆందోళన చేపట్టారు. నందిగామ మార్కెట్ యార్డ్ లో దళారీ వ్యవస్థ నడుస్తుందని యార్డ్ లో అర్ధరాత్రి దళారీలు తమ పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నెంబర్ తీసుకున్నా తమ బళ్లను అన్ లోడ్ చేయనివ్వడం లేదని వాపోయారు.