ఏపీ అవతరణ దినోత్సవం... అమరజీవికి టిడిపి చీఫ్ చంద్రబాబు ఘననివాళి

Nov 1, 2022, 3:56 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఘన నివాళి అర్పించింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నాయకులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలను త్యాగం చేసి స్వరాష్ట్రానికి సాధించిపెట్టిన పొట్టి శ్రీరాములు పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.