ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు జగన్ ప్రభుత్వం కోల్పోయింది.. సోమిరెడ్డి

Jun 11, 2020, 12:21 PM IST

నెల్లూరు జిల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏపీ ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగనిదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని హెచ్చరించడం 
రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్దకంలోకి నెట్టిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశాక ఈ ప్రభుత్వం కొనసాగే నైతికహక్కును కోల్పోయింది.