న్యాయస్థానం టు దేవస్ధానం: అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

Nov 1, 2021, 11:13 AM IST

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం సోమవారం మరింత ఉదృతమయ్యింది. ఇవాళ(సోమవారం) ఉదయమే 'న్యాయస్థానం టు దేవస్థానం' పేరిట తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభమయ్యింది. తుళ్లూరు నుంచి పరిమి మీదుగా తాడికొండకు ఈ రోజు పాదయాత్ర 
సాగనుంది. గుంటూరు జిల్లాలో 6రోజులు పాదయాత్ర సాగనుంది.