ప్రేయసికి మద్యం తాగించాడు: మిత్రులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు

By telugu teamFirst Published Apr 16, 2019, 7:14 AM IST
Highlights

ఆమెకు మద్యం తాగించి తన స్నేహితులతో కలిసి యువకుడు అత్యాచారం చేశాడు. కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఆ మహిళ (32)కు వివాహమైంది. అయితే, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది.

హైదరాబాద్: మద్యం తాగించి ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సాహెబ్‌నగర్‌ ప్రాంతానికి ఓ యువకుడు తన స్నేహితురాలిని నమ్మించి మందు పార్టీకి పిలిపించాడు. 

ఆమెకు మద్యం తాగించి తన స్నేహితులతో కలిసి యువకుడు అత్యాచారం చేశాడు. కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఆ మహిళ (32)కు వివాహమైంది. అయితే, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆమెకు మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారి మనోజ్‌కుమార్‌ (30)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 

మనోజ్‌కుమార్‌ తన 8మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. సాహెబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పార్టీ ఉందని ప్రియురాలిని పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమెకి మనోజ్‌కుమార్, అతని స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు.  ఎక్కువ మోతాదులో మద్యం తాగడంతో మనోజ్‌కుమార్‌ ప్రేయసి నిద్రమత్తులోకి జారుకుంది. ఇదే అదునునుగా భావించిన మనోజ్‌కుమార్, అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

స్పృహలోకి వచ్చిన మహిళ తనకు జరిగిన అన్యాయంపై వనస్థలిపురం పోలీçసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!