
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆస్తుల కేసులో బుధవారం నాడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కీలకమైన విచారణ చేయనున్నారు.
రేవంత్ రెడ్డి ఆస్తుల కేసులో కొండల్ రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్ లను కూడ విచారణ చేయనున్నారు.ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, ఉదయ్ సింహలను ప్రశ్నించారు. వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో సెబాస్టియన్ , ఉదయ్ సింహ ఇళ్లలో కూడ ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు..
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయనే విషయమై ఆదాయపు పన్ను శాఖాధికారులు ప్రశ్నించనున్నారు. రేవంత్ రెడ్డి ఆస్తుల కేసులో సుమారు 20 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించినట్టు సమాచారం. బుధవారం నాడు రేవంత్ రెడ్డి ఐటీ శాఖాధికారుల విచారణకు హాజరుకానున్నారు.
రేవంత్ రెడ్డి విచారణను మూడు రకాలుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఉదయ్ సింహ స్నేహితుడు రణధీర్ ఇంట్లో దొరికిన కంప్యూటర్ ఇతర ఆధారాల ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.
సంబంధిత వార్తలు
ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య
కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్
రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?
తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి
పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్
ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...
రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు
రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్
ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన
కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్
రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?
తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి
పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్
ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...
రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు
కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?
రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారుల