బండి ఎక్కించుకుని మహిళపై తండ్రీకొడుకుల రేప్: నిప్పు పెట్టి....

By telugu teamFirst Published Feb 27, 2021, 8:23 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ప్రాంతంలో ఓ మహిళపై తండ్రీకొడుకులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత మహిళ ఒంటికి నిప్పు పెట్టారు. తండ్రీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీతాపూర్: ఓ మహిళ పట్ల తండ్రీకొడుకులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఓ మ హిళను తమ బండిని ఎక్కించుకుని ఆ తర్వాత ఆమెపై ఇద్దరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె ఒంటికి నిప్పు అంటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సితాపూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిళ మిశ్రిక్ లోని తమ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆ సంఘటన జరిగింది. 

నిందితులిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆ సంఘటన గురువారం సాయంత్రం జరిగిందని, నైమిషారణ్యంలోని మిశ్రిక్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి, ఆమె ఒంటికి నిప్పు పెట్టారని 112 ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. 

మహిళ సిద్ధౌలీలోని తన తల్లిగారింటి నుంచి మిశ్రిక్ కు వెళ్తుండగా నిందితుడు తన బండిపై లిఫ్ట్ ఇచ్చాడని పోలీసులు చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన ఈ కేసులో 55 ఏళ్ల వ్యక్తిని, అతని కొడుకుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

మహిళను సీతాపూర్ లోని ఆస్పత్రిలో చేర్చారు. మహిళకు 30 శాతం గాయాలయ్యాయని, ఆమె ప్రాణాపాయం తప్పిందని వైద్యుల బృందం తెలిపింది.

click me!