ఇద్దరమ్మాయిలపై 11మంది గ్యాంగ్ రేప్, స్నేహితుడి నిర్వాకమే...

By Arun Kumar PFirst Published Aug 20, 2018, 11:57 AM IST
Highlights

అమ్మాయిలు ఒంటరి కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే యువతులు తమ బందువులు, స్నేహితులు ఎవర్నీ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయినవారే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జార్ణండ్ లో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది.

అమ్మాయిలు ఒంటరి కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే యువతులు తమ బందువులు, స్నేహితులు ఎవర్నీ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయినవారే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జార్ణండ్ లో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది.

జార్ణండ్ రాజధాని రాంచీ సమీపంలోని లోహర్ దగా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. సాయం కోరిన ఇద్దరు యువతులపై స్నేహితుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు తన మిత్రులతో కూడా ఆ అమ్మాయిలపై అత్యాచారం చేయించాడు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆగస్ట్ 16వ తేదీన ఇద్దరు యువతులు స్కూటీపై పక్క గ్రామానికి వెళుతున్నారు. ఈ క్రమంలో వారి వాహనం రెండు గ్రామాల మధ్యలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోయింది. దీంతో వారికి ఏం చేయాలో తెలీక ఓ స్నేహితుడిని సాయం కోరారు. దీన్ని అదునుగా భావించిన అతడు సాయం చేయడం మరిచి తన కామ వాంఛ తీర్చుకోడానికి సిద్దమయ్యాడు. తానే కాదు తన ఇతర మిత్రులను కూడా ఇందుకు పురిగొల్పాడు.

అమ్మాయిలున్న ప్రాంతానికి యువకుడితో పాటు అతడి మిత్రులు 10 మంది చేరుకున్నారు. ఇద్దరు బాధితురాళ్లను భయపెట్టి వారిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నింటిని తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుండి పరారయ్యారు.

అయితే భాదిత యువతులు భయపడకుండా తమపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన యువకులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  


 
 

click me!