Dec 3, 2018, 12:04 PM IST
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కేరళ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. తీర్పు అమలు కోసం మద్దతు కూడగడుతోంది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలు తెలపడంతో, అసెంబ్లీ ఒక రోజుకు వాయిదా పడింది.