దొంగ అనుకుని కూతురి ఫ్రెండ్‌ను చంపిన తండ్రి.. ఇంట్లో రాత్రి చప్పుళ్లు రావడంతో మేలుకుని హత్య

By Mahesh KFirst Published Dec 29, 2021, 4:18 PM IST
Highlights

కేరళలో ఘోరం జరిగింది. తన కూతురి ఫ్రెండ్‌ను దొంగ అనుకుని ఇంట్లోనే చంపేశాడు ఆ తండ్రి. బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి చప్పుళ్లు రావడంతో బహుశా దొంగ ఇంటిలోకి ప్రవేశించి ఉండవచ్చునని ఆ ఇంటి యజమాని భావించాడు. వెంటనే అప్రమత్తమయ్యాడు. కనిపించగానే అతనిపై విరుచుకుపడ్డాడు. కత్తితోనూ దాడి చేశాడు. 
 

తిరువనంతపురం: అర్ధరాత్రి దాటి అప్పుడే సమయం మూడు గంటలు కావస్తోంది. ఉన్నట్టుండి ఇంటలో చప్పుళ్లు వచ్చాయి. ఈ చప్పుళ్లతో ఇంటి యజమాని మేలుకున్నాడు. గది బయట అడుగుపెట్టగానే ఓ వ్యక్తి రాత్రి పూట ఇంటిలోనే తచ్చాడుతూ కనిపించాడు. అలా తిరుగుతున్న వ్యక్తి కచ్చితంగా దొంగే అని భావించాడు. దొరకబుచ్చుకుని కత్తితో పొడిచి హతమార్చాడు. కానీ, ఆ తర్వాత నిజం తెలిసి ఆయనకు దిమ్మదిరిగి పోయింది. తన కూతురి(Daughter)ని కలవడానికి వచ్చిన మిత్రుడే(Friend) అతడని తేలడంతో ఆ తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు. నేరుగా ఇల్లు వదిలి పోలీస్ స్టేషన్(Police Station) వెళ్లాడు. తమ ఇంటిలో తాను ఓ వ్యక్తిని కత్తితో పొడిచి(Stab) చంపానని పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. అంతేకాదు, ఆ వ్యక్తి ఇంకా గాయాలతో తల్లడిల్లుతున్నాడని, హాస్పిటల్ తీసుకెళ్లండి అని వారికి సూచించాడు. కానీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడిని అనీష్ జార్జ్‌గా గుర్తించారు. అనీష్ జార్జ్‌కు 19 ఏళ్ల వయసు. 

తిరువనంతపురం పెట్టాలోని తమ ఇంట్లో ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే నిద్రపోయారు. కానీ, ఉన్నట్టుండా తెల్లవారు జామున 3 గంటలకు తటాలున శబ్దాలు వచ్చాయి. ఈ చప్పుళ్లతో ఇంట్లోకి వేరే వ్యక్తి ప్రవేశించి ఉండవచ్చని, బహుశా ఆ వ్యక్తి దొంగ అయి ఉండవచ్చని ఇంట్లో నిద్రిస్తున్న లలన్ భావించాడు. దీంతో జాగ్రత్తగా గది బయట అడుగు పెట్టాడు. ఆ చీకటిలో ఓ వ్యక్తి అడుగులు వేస్తున్నట్టు కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన లలన్ ఆ వ్యక్తిని దొరకబట్టాడు. ఒక్క సారిగా ఆ వ్యక్తిపై దాడి చేశాడు. కత్తితోనూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడిపోయాడు. కానీ, ఆ తర్వాతే అసలు విషయం బయటకు వచ్చింది. తాను కత్తితో దాడి చేసిన వ్యక్తి దొంగ కాదని, ఆయన కేవలం తన కూతురి ఫ్రెండ్ అని తెలియవచ్చింది. 

Also Read: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే.. కట్నం కోసం వేధించాడు.. చివరికి ఉరివేసి.. మెట్ పల్లిలో ఘటన

ఆ తర్వాత ఆయన నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తాన ఒక వ్యక్తిని తమ ఇంట్లో హతమార్చాడని స్పష్టం చేశాడు. కత్తితో ఒకరిని పొడిచేయాలని భావించినట్టు వివరించాడు. అలాగే, కత్తితో దాడి చేసినట్టూ పోలీసుల ముందు అంగీకరించాడు. వెంటనే ఆయననను హాస్పిటల్ తీసుకు వెళ్లాల్సిందిగా తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్లాడు. పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్లారు. గాయపడ్డ అనీష్ జార్జ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అనీష్ జార్జ్ బతుకలేకపోయాడు. హాస్పిటల్ స్మశానంల ఆయననకు ఖననం చేశారు. కేసుల దర్యాపులో లలన్ సింగ్‌న పోలీసులు ప్రశ్నలు కురిపించనున్నారు.

Also Read: కొడుకుతో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన భార్య.. పది రోజులుగా శవాన్ని ఇంట్లోనే దాచి, పరార్..

ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కట్నం కోసం వేధింపులు చేయడం ప్రారంభించాడు. భార్యను పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని తరచూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో పెద్దలు కలుగజేసుకొని పలుమార్లు అతడికి నచ్చజెప్పారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ త‌రువాత భార్య‌ను వేధించ‌డం మ‌ళ్లీ మొద‌లుపెట్టాడు. ఇంట్లో అంద‌రూ నిద్ర‌పోయిన త‌రువాత భార్య మెడ‌ను తాడుతో గ‌ట్టిగా బిగించాడు. దీంతో ఆమె మృతి చెందింది. త‌రువాత దానిని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌యత్నం చేశాడు. అయినా పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేయ‌డంతో అది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యా అని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  ఈ ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో జ‌రిగింది. 

click me!